జీడిమెట్ల, వెలుగు: అధిక మోతాదులో మద్యం సేవించిన ఓ వ్యక్తి మృతిచెందాడు. రాజస్థాన్కు చెందిన అనీల్కుమార్(30) బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి గుండ్లపోచంపల్లిలో ఉంటూ లేబర్ పని చేస్తున్నాడు. ఇతడికి ఆరోగ్య సమస్యలు ఉండటంతో మద్యానికి దూరంగా ఉండాలని డాక్టర్లు సూచించారు.
న్యూఇయర్ వేడుకల సందర్భంగా గురువారం రాత్రి బిల్డింగ్ టెర్సస్ పై అతిగా మద్యం సేవించాడు. అపస్మారక స్థితికి వెళ్లి కింద పడిపోయాడు. రూమ్మేట్స్ అతడిని వెంటనే దవాఖానకు తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్లు తెలిపారు. పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
