హైదరాబాద్ ఎల్బీ నగర్ లోని చింతలకుంటలో ఓ వ్యక్తి రేడియో టవర్ ఎక్కిన హల్ చల్ చేశాడు. ఏప్రిల్ 14వ తేదీ శుక్రవారం ఉదయం లింగోజిగూడ డివిజన్ కు చెందిన నర్సింగ్ రావు అనే వ్యక్తి దళితబంధు రాలేదని రేడియో టవర్ ఎక్కి నిరసన తెలిపాడు. లింగోజిగూడా బస్తీలో దళిత బంధుతో పాటు కేసీఆర్ ప్రకటించిన ఇండ్లు లేని పేదలకు రూ.3 లక్షల స్కీంను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశాడు.
అయితే ఈ విషయంపై గతంలో సీఎంకు, గవర్నర్, కలెక్టర్ అధికారులందరికి వినతి పత్రం ఇచ్చిన ఫలితం లేదని.. ఎవరూ పట్టించుకోడంలేదని ఆరోపించాడు. ఈ క్రమంలో శుక్రవారం అంబేద్కర్ జయంతి రోజున టవర్ ఎక్కున నర్సింగ్ రావు తన డిమాండ్ నెరవేర్చాలని కోరాడు. సీఎం కేసీఆర్ గతంలో చింతమడకలో దళిత బంధు, డబుల్ బెడ్రూం ఇండ్లు ఇచ్చారని.. ఇప్పుడు తమకు ఇవ్వడం లేదని నర్సింగ్ రావు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.