‘బాయ్‌కాట్ భైరవం’ తగదు: డైరెక్టర్ విజయ్పై మెగా ఫ్యాన్స్ ట్రోలింగ్.. క్షమాపణలు చెప్పిన మంచు మనోజ్

‘బాయ్‌కాట్ భైరవం’ తగదు: డైరెక్టర్ విజయ్పై మెగా ఫ్యాన్స్ ట్రోలింగ్.. క్షమాపణలు చెప్పిన మంచు మనోజ్

‘నాంది’,‘ఉగ్రం’సినిమాల డైరెక్టర్ విజయ్‌‌ కనకమేడలపై సొషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్న విషయం తెలిసిందే. భైరవం మూవీతో మే 30న ప్రేక్షకుల ముందుకువస్తున్నాడు విజయ్‌‌. అతను తన అకౌంట్ హ్యాక్ అయ్యిందని, ఆ సదరు పోస్ట్ తాను పెట్టింది కాదని చెప్పుకొచ్చిన మెగా ఫ్యాన్స్ కూల్ అవ్వట్లేదు. ఈ క్రమంలో దర్శకుడు విజయ్పై తీవ్ర వ్యతిరేఖత వస్తుండటం పట్ల మంచు మనోజ్ స్పందించారు. 

మంచు మనోజ్ మాట్లాడుతూ.. " ఈ మధ్య కాలంలో 'బాయ్‌కాట్ భైరవం' అనే ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అది చూసాను. భైరవం డైరెక్టర్ విజయ్ కనకమేడల మోస్ట్ హార్డ్ వర్కింగ్, ఆయన ఎప్పుడూ పదిమందికి సేవ చేస్తూ ఉంటారు. ఎప్పుడో, ఎవరో పోస్ట్ పెట్టారని.. అసలు పోస్ట్ పెట్టారో లేదో కూడా తెలియదు. అలాంటి ట్రెండ్ అయ్యే ట్యాగ్ ఒకటి తీసుకొచ్చి, దాన్ని భైరవం సినిమాకి ట్యాగ్ చేసి, ఇంతమంది కష్టపడిన సినిమాని ఇలా 'బాయ్‌కాట్ భైరవం' అని చేయడం మంచికాదని" మనోజ్ కుమార్ ఆవేదన వ్యక్తపరిచారు. 

అలాగే, 'దర్శకుడు విజయ్ తన పేస్ బుక్ లో ఒక పోస్ట్ పెట్టారని అంటున్నారు. అసలు అది నిజమో కాదో తెలియదు. నిజానికి ఒక విషయం చెబుతున్నా.. మెగా హీరోలు చిరంజీవి, పవన్‌ కళ్యాణ్ కు విజయ్ వీరాభిమానని. అంటే మెగా ఫ్యాన్స్ లో తానూ కూడా ఒకరు. ఇప్పుడు  అందరూ ఒక్కటై అతన్ని ఒంటరి చేసి ఇలా నిందిస్తుంటే.. ఎంతో బాధ పడుతున్నాడో.. నాకు తెలుసంటూ' మనోజ్ ఎమోషనల్గా మాట్లాడారు.

మరో విషయం చెబుతూ.. 'పవన్‌ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ సెకండాఫ్లో ఒక్కసీన్ అయిన డైరెక్ట్ చేయాలనే తపనతో.. ఆ  మూవీ డైరెక్టర్ను రిక్వెస్ట్ చేసి మరి సెట్కు వెళ్లడాంటే.. అతని నిజమైన అభిమానం ఎలాంటిదో ఉంహించుకోండని' మెగా ఫ్యాన్స్ను మనోజ్ రిక్వెస్ట్ చేశాడు. 

చివరగా మనోజ్ తన స్పీచ్ ను ముగిస్తూ.. 'గత మూడ్రోజులుగా ఆయన అలా బాధపడుతుంటే చూడలేకపోతున్నామని, మెగా ఫ్యాన్స్ అంతా భైరవం మూవీకి సపోర్ట్ చేయాలని కోరారు. ఒకవేళ ఆ పోస్టు విషయంలో ఇబ్బందిగా ఫీల్‌ అయితే భైరవం టీమ్‌ తరఫున మెగా అభిమానులకు క్షమాపణలు చెబుతున్నానంటూ' మంచు మనోజ్ అన్నారు. ప్రస్తుతం మనోజ్ మాట్లాడిన మాటలు సొషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఈ ఎమోషనల్ మాటలకు మెగా ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారనే ఆసక్తి నెలకొంది. 

అసలేమైందంటే:

2011లో చిరంజీవి, రామ్‌ చరణ్‌లపై ఫేస్‌బుక్‌లో పెట్టిన ఒక పోస్ట్‌ వల్ల మెగా ఫ్యాన్స్లో దుమారం రేపాడు. హిందీలో అమితాబ్‌, అభిషేక్‌ కలిసి నటించిన ‘పా’మూవీ పోస్టర్‌ని మార్పింగ్‌ చేసి చిరంజీవి, రామ్‌ చరణ్‌ ముఖాలను వాటిపై అతికించడంతో.. 'బాయ్‌కాట్ భైరవం' అనేలా మార్మోగిపోయాడు.  

ఇక ఎడిట్ చేసిన ఆ పోస్టర్‌కి ‘ఛా’అనే టైటిల్‌ పెట్టి.. ‘సామాజిక న్యాయం సమర్పించు..‘ఛా’అని వ్యంగ్యంగా క్యాప్షన్ ఇవ్వడంతో మెగా ఫ్యామిలీ వివాదంలో చిక్కుకుపోయాడు. అయితే, మెగా ఫ్యాన్స్కు క్షమాపణలు చెబుతూ నోట్ రిలీజ్ చేసినప్పటికీ.. ఎక్కడ తగ్గట్లేదు. మరి భైరవం రిలీజ్ వరకు ఎలాంటి పరిణామాలు మొదలవుతాయో చూడాలి.