
మంచు మోహన్ బాబు- సూపర్ స్టార్ రజినీకాంత్ ఎంత మంచి మిత్రులో అందరికీ తెలిసిందే. అప్పుడప్పుడు వీళ్లిద్దరూ సరదాగా కలుస్తూ ఉంటారు. తాజాగా జూన్ 15కి వీరు కలిసి నటించిన ‘పెద రాయుడు’ చిత్రం విడుదలై ముప్ఫై ఏళ్లు పూర్తయింది. అదే రోజున తన బెస్ట్ ఫ్రెండ్ ‘కన్నప్ప’ చిత్రాన్ని చూశారని మోహన్ బాబు ట్వీట్ చేశారు. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా రూపొందిన ఈ మూవీ స్పెషల్ షోను చెన్నైలో రజినీకాంత్కు చూపించారు. ఈ సందర్భంగా రజినీకాంత్తో తాను, విష్ణు దిగిన ఫొటోలను మోహన్ బాబు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
‘కన్నప్ప’ చిత్రం చూశాక రజినీకాంత్ చూపించిన ప్రేమ, ఆప్యాయత, ప్రోత్సాహం ఎప్పటికీ మర్చిపోలేనని చెబుతూ.. థ్యాంక్యూ మిత్రమా అని ఆయన ట్వీట్ చేశారు. అలాగే మంచు విష్ణు కూడా తన ఆనందాన్ని షేర్ చేశాడు. సినిమా చూసి తనను రజినీకాంత్ గట్టిగా హగ్ చేసుకున్నారని, ఆ కౌగిలి కోసం ఓ నటుడిగా 22 ఏండ్లుగా ఎదురుచూస్తున్నానని విష్ణు పోస్ట్ చేశాడు. జూన్ 27న పాన్ ఇండియా వైడ్గా ఈ సినిమా విడుదల కానుంది.