కోలీవుడ్ లో కమెడియన్గా అలరించి హీరోగా మారిన సూరి, టాలెంటెడ్ టాలీవుడ్ యాక్టర్ సుహాస్ కాంబినేషన్లో వచ్చిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'మందాడి'. భారీ అంచనాల మధ్య ఈ మూవీ సెప్టెంబర్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. దర్శకుడు మతిమారన్ పుగళేంది తెరకెక్కించిన ఈ మూవీ.. పోటీగా వచ్చిన 'సర్దార్ 2' వంటి పెద్ద సినిమాను తట్టుకుని క్లియర్ విన్నర్గా నిలిచింది.
విశాఖపట్నం, తమిళనాడు తీరప్రాంతాల నేపథ్యంలో సాగే అరుదైన 'బోట్ రేసింగ్' కాన్సెప్ట్ ప్రేక్షకులను థ్రిల్కు గురిచేస్తోంది. వినాయక చవితి పండుగ సెలవులు, లాంగ్ వీకెండ్ను పర్ఫెక్ట్గా వాడుకున్న ఈ చిత్రం, మౌత్ టాక్తో క్రమంగా పుంజుకుంటోంది. సోమవారం టెస్ట్ను కూడా సక్సెస్ఫుల్గా దాటేసింది. మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ చేసిన ఈ మూవీ కేవలం 5 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 65 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే దాదాపు రూ. 7 కోట్ల గ్రాస్ వసూలు రాబట్టింది.
జివి ప్రకాష్ కుమార్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్, కథిర్ ఫొటోగ్రఫీ, పీటర్ హెయిన్ నేతృత్వంలో వచ్చిన బోట్ రేసింగ్ యాక్షన్ సీన్స్ థియేటర్లలో ప్రేక్షకులకు మైండ్ బ్లాకింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తున్నాయి. సూరి, సుహాస్ నటనతో పాటు సత్యరాజ్, రవీంద్ర విజయ్, మహిమా నంబియార్ల నటన సినిమాకి ప్రాణం పోసింది. ఆర్ఎస్ ఇన్ఫోటైన్మెంట్ పతాకంపై ఎల్రెడ్ కుమార్ నిర్మించగా, స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ క్రియేటివ్ ప్రోడ్యూసర్గా వ్యవహరించారు.
►ALSO READ | 'డేవిడ్ రెడ్డి'లో శివగామి రచ్చ.. కమలారెడ్డిగా రమ్యకృష్ణ భయంకరమైన ఫస్ట్ లుక్!
సూపర్స్టార్ రజినీకాంత్ సైతం ఈ చిత్రాన్ని చూసి చిత్రబృందంపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇదే జోరు కొనసాగితే అతిత్వరలోనే ఈ చిత్రం రూ. 100 కోట్ల క్లబ్లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. సూరి, సుహాస్ల కెరీర్లోనే ఇది బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్గా నిలిచింది. సినీ ప్రియుల నుంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుని ముందుకు దూసుకెళ్తోంది.
