మహబూబాబాద్ కలెక్టరేట్ కార్యాలయం వద్ద జరిగిన ఓ అనూహ్య ఘటన కలకలం రేపింది. కలెక్టరేట్ ప్రధాన గేట్లను ఓ కారు వేగంగా వచ్చి ఢీకొట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సెప్టెంబర్ 11న రాత్రి సుమారు 10 గంటల సమయంలో ఎల్లో ప్లేట్ కారు అత్యంత వేగంగా వచ్చి కలెక్టరేట్ మెయిన్ గేట్లను ఢీకొట్టింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అయితే ఈ కారు ఏ శాఖకు చెందినది? ప్రభుత్వ వాహనమా లేక ప్రైవేటా? అనే కోణంలో అధికారులు తీవ్రంగా ఆరా తీస్తున్నారు. మరోవైపు కారులో ఉన్న వ్యక్తులు మద్యం సేవించి ఉన్నారా? కావాలనే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
ఘటన స్థలానికి సంబంధించిన సీసీటీవీ (CCTV) పుటేజ్ దృశ్యాలను కలెక్టరేట్ అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించే పనిలో కలెక్టరేట్ సిబ్బంది నిమగ్నమయ్యారు.
►ALSO READ | మహిళా సంక్షేమమే సీఎం రేవంత్ లక్ష్యం: మంత్రి సీతక్క
