- దండేపల్లి గ్రామంలోని మిల్లులో ఘటన
ఎల్కతుర్తి, వెలుగు : వడ్ల బస్తాలు మీద పడి హమాలీ కార్మికుడు చనిపోయాడు. ఈ ఘటన హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం దండేపల్లి గ్రామంలోని శ్రీనిధి ఇండస్ట్రీస్ఆదివారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే... బిహార్ రాష్ట్రంలోని నలంద జిల్లా మోహన్ పూర్ ఇందిరానగర్ కు చెందిన జటన్ మాంజీ (36) శ్రీనిధి ఇండస్ట్రీస్ లో హమాలీగా పనిచేస్తున్నాడు.
ఆదివారం ఉదయం తోటి కార్మికులతో కలిసి వడ్ల బస్తాలను లారీలో లోడ్చేస్తున్నాడు. ఈ క్రమంలో వడ్ల బస్తాలు ఒక్కసారిగా మాంజీ మీద పడిపోయాయి. గమనించిన తోటి హమాలీలు బస్తాలను తొలగించి, మాంజీని ఎంజీఎం హాస్పిటల్ కు తరలించారు. డాక్టర్లు పరీక్షించి అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. మృతుడి బంధువు రాజ్బల్లాహ్ మాంజీ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై నర్సింహారావు తెలిపారు.
