ఎస్సీ వర్గీకరణపై కేంద్రానికి లేఖ రాయండి.. మందకృష్ణ

ఎస్సీ వర్గీకరణపై కేంద్రానికి లేఖ రాయండి.. మందకృష్ణ

పద్మారావునగర్, వెలుగు: ఎస్సీ వర్గీకరణ అంశంపై కాంగ్రెస్ తప్ప అన్ని రాజకీయ పార్టీలు కేంద్ర ప్రభుత్వానికి తమ అభిప్రాయాలను చెప్పాయని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. వెంటనే కాంగ్రెస్ పార్టీ కూడా ఎస్సీ వర్గీకరణ అంశంపై కేంద్రానికి లేఖ రాయాలని కోరారు.

శనివారం హైదరాబాద్‌ పార్శిగుట్టలోని ఎమ్మార్పీఎస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చేవెళ్ల డిక్లరేషన్‌లో వర్గీకరణకు మద్దతిచ్చిన కాంగ్రెస్ అధిష్టానం.. ఈ నెల 16లోగా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని కోరారు. ఈ నెల 17న సుప్రీంకోర్టులో జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలో ఏడుగురు న్యాయమూర్తుల బెంచ్‌ ముందు వర్గీకరణపై హియరింగ్ ఉందని చెప్పారు. ఈ మూడు ప్రతిపాదనలు ఈ నెల 16లోగా చేయాలని సీఎం రేవంత్‌కు విజ్ఞప్తి చేశారు.