11న మాదిగ ఉప కులాల విశ్వరూప మహాసభ: మందకృష్ణ

11న మాదిగ ఉప కులాల విశ్వరూప మహాసభ: మందకృష్ణ

ఖైరతాబాద్, వెలుగు : ఈ నెల11న సికింద్రాబాద్​లోని పరేడ్ గ్రౌండ్​లో మాదిగ ఉప కులాల విశ్వరూప మహాసభ నిర్వహిస్తున్నట్లు  మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి(ఎమ్మార్పీఎస్) వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తెలిపారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..  తాము నిర్వహించే సభకు చీఫ్​గెస్టుగా ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించామని చెప్పారు.  ఏ ఆశయం కోసం ఎమ్మార్పీఎస్​ను​ తీసుకొచ్చామో  అది ఇప్పుడు నెరవేరే సమయం వచ్చిందని పేర్కొన్నారు.

తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటక,మహారాష్ట్ర ప్రాంతాల నుంచి  స్వచ్ఛందంగా విశ్వరూప మహాసభకు హాజరవుతున్నారని, కూలి చేసుకున్న డబ్బులతో హైదరాబాద్​ వచ్చి .. అందుబాటులో ఉన్న రవాణ సదుపాయాలను  వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం విశ్వరూప మహాసభ పోస్టర్​ను ఆయన ఆవిష్కరించారు.