నిజాంసాగర్(ఎల్లారెడ్డి), వెలుగు: తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ బడిలో చదివించాలని, అలా చదివిస్తే పన్నులను తానే చెల్లిస్తానని కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం మంగ్లూర్ సర్పంచ్ ప్రకటించారు. స్థానిక ప్రైమరీ స్కూల్లో ఈ ఏడాది పిల్లలను చేర్పిస్తే వారి ఇంటి పన్నులు, నీటి పన్నులు తానే చెల్లించనున్నట్లు గ్రామ సర్పంచ్ రాజు తెలిపారు.
స్కూల్లో విద్యార్థుల సంఖ్య తగ్గకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. గురువారం నలుగురు విద్యార్థులు చేరగా వారి ఇంటి పన్నులు చెల్లించనున్నట్లు తెలిపారు.
