మా బలం ఏందో వరంగల్ రాహుల్ సభలో చూపెడ్తం

మా బలం ఏందో  వరంగల్ రాహుల్ సభలో చూపెడ్తం

హైదరాబాద్, వెలుగు: టీఆర్‌‌ఎస్‌తో కాంగ్రెస్ పార్టీ పొత్తు ఉంటుందన్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మాణిక్కం ఠాగూర్ స్పష్టం చేశారు. బీజేపీ, టీఆర్‌‌ఎస్‌లపై పోరాటంలో వెనక్కు తగ్గదేలేదని ఆదివారం ట్విట్టర్‌‌లో పేర్కొన్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలను ఆ రెండు పార్టీలే చేస్తున్నాయని చెప్పారు. మా బలం ఏందో వచ్చే నెల 6న వరంగల్‌లో జరిగే రాహుల్‌ గాంధీ సభలో చూపిస్తామని ఆయన తెలిపారు.