2024లోనూ ఇదే స్ఫూర్తిని కొనసాగించాలి : మోదీ

2024లోనూ ఇదే స్ఫూర్తిని కొనసాగించాలి : మోదీ

ఈ ఏడాది దేశం ఎన్నో ఘనతలు సాధించిందని అన్నారు ప్రధాని మోదీ. సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న మహిళా బిల్లు ఆమోదం పొందిందన్నారు.   జీ20 విజయవంతం, భారత్‌ ఐదో ఆర్థిక వ్యవస్థగా మారడంపై ప్రజలు లేఖలు రాసి సంతోషం వ్యక్తం చేశారని చెప్పారు.  నాటునాటు పాటకు ఆస్కార్ వరించింది.  వన్డే వరల్డ్ కప్ లో భారత జట్టు అందరి మనసులు దోచిందని తెలిపారు.  ఈఏడాది చివరి 'మన్ కీ బాత్' ఎపిసోడ్‌లో మోదీ మాట్లాడారు.   

దేశ ప్రజలు వికసిత్‌, ఆత్మనిర్భర్‌ భారత్‌ స్ఫూర్తిని 2024లోనూ ఇదే స్పూర్తిని కొనసాగించాలని మోదీ ఆకాంక్షించారు.  అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవానికి ముందు వచ్చిన స్పందన పట్ల ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని మోదీ కొత్త  సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.