మహిళల రక్షణ కోసం బస్సుల్లో మార్షల్స్‌ : కేజ్రీవాల్‌

మహిళల రక్షణ కోసం బస్సుల్లో మార్షల్స్‌ : కేజ్రీవాల్‌

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరో కార్యక్రమాన్ని చేపట్టారు. ఇప్పటికే మహిళలు ఫ్రీగా ప్రయాణించేందుకు అవకాశం కల్పించిన ఆయన…వారికి రక్షణ కల్పించేందుకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే బస్సులో ప్రయాణించే మహిళా ప్రయాణికులకు రక్షణగా బస్సులో మార్షల్స్‌ను నియమిస్తున్నట్లు తెలిపారు. రేపటి(మంగళవారం) నుంచి బస్సుల్లో మార్షల్స్‌ను నియమిస్తున్నామన్నారు. దీనికోసం ఇప్పటి వరకూ 13 వేల మంది మార్షల్స్‌ను రిక్రూట్‌ చేశామని సీఎం కేజ్రీవాల్ చెప్పారు.