జకార్తా: ఇండోనేషియాలో జరిగిన ప్రెసిడెంట్ కప్ ఫైనల్ లో భారత బాక్సర్ మేరి కోమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. 51 కేజీల విభాగంలో జరిగిన టోర్నమెంట్ లో ఆస్ట్రేలియా బాక్సర్ ఫ్రాంక్స్ ఏప్రిల్ను 5-0 తేడాతో ఓడించి మేరి విజయం సాధించింది. బాక్సింగ్లో ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్గా నిలిచిన మేరీకోమ్ ఈ ఏడాది మేలో జరిగిన భారత ఓపెన్ బాక్సింగ్ టోర్నమెంట్లోనూ గోల్డ్ మెడల్ ను సొంతం చేసుకుంది. ఈ ఏడాది సెప్టెంబర్ 7నుంచి 21 తేదీల్లో రష్యాలో జరగనున్న ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్-2019లో మేరీకోమ్ పాల్గొననుంది.
Gold medal for me and for my country at #PresidentCup Indonesia. Winning means you’re willing to go longer,work harder & give more effort than anyone else. I sincerely thanks to all my Coaches and support staffs of @BFI_official @KirenRijiju @Media_SAI pic.twitter.com/R9qxWVgw81
— Mary Kom (@MangteC) July 28, 2019

