కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు

కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు

వనపర్తి, వెలుగు: కాంగ్రెస్ పార్టీ  చేరికల కమిటీ చైర్మన్ జగ్గారెడ్డి  సమక్షంలో  రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు జిల్లెల చిన్నారెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం  హైదరాబాద్​లోని  గాంధీభవన్ లో  కాంగ్రెస్ పార్టీ లో  చేరారు. వనపర్తి జిల్లా గోపాలపేట మండలం  నుంచి 130 మంది పైగా వివిధ  పార్టీల నాయకులు పార్టీ కండువా కప్పుకున్నారు.  గోపాలపేట మండలం తాడిపత్రి, నర్సింగాయిపల్లి గ్రామాల నుండి జోగు శాంతన్న , అతని అనుచరులు బీఆర్ఎస్, బీజేపీ  నుంచి చిన్నారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరుతున్నామని ప్రకటించారు.  పార్లమెంట్ ఎలక్షన్ లో  రాష్ట్రంలో అత్యధిక సీట్లను కాంగ్రెస్ పార్టీ  గెలవబోతుందని అన్నారు. కార్యక్రమంలో గోపాలపేట మండల అధ్యక్షులు గణేశ్​ గౌడ్, బి కృష్ణ, కౌన్సిలర్ పద్మ పరుశురాం, నరసింహ, కుమార్ తదితరులు పాల్గొన్నారు.