నిజామాబాద్​లో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం

నిజామాబాద్​లో  అర్ధరాత్రి అగ్ని ప్రమాదం
  •     సుమారు 40 లక్షల ఆస్తి నష్టం

నిజామాబాద్ క్రైమ్, వెలుగు: నిజామాబాద్ నగరంలో శుక్రవారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. దేవీ రోడ్​లో ఉన్న బాలాజీ సానిటరీ బిల్డింగ్​లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.  గమనించిన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది ఏడు ఫైరింజన్లతో మంటలను అదుపు చేశారు. బిల్డింగ్ ​పూర్తిగా కాలిపోగా, రూ.40 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేశారు. ప్రమాదంలో నలుగురికి  గాయాలయ్యాయి. అగ్ని ప్రమాదం ఎలా జరిగిందనే విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.