హైదరాబాద్, వెలుగు: ఇటీవల విడుదలైన ఇంటర్ఫలితాల్లో హైదరాబాద్లోని మాస్టర్మైండ్స్ స్టూడెంట్స్ అద్భుత ప్రతిభ కనబరిచారు. ఫస్టియర్ఎంఈసీ గ్రూప్లో డి. వర్ష 496/500, సెకండియర్ ఎంఈసీలో కె. గాయత్రి వర్ధిని 991/1000, ఆర్. సిరినిత్య 991/1000 మార్కులు సాధించి స్టేట్ టాపర్లుగా నిలిచారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ఎస్ వీఆర్, ఎస్ఎం వలీ, అకడమిక్ ప్రిన్సిపాల్ అంజనేయ రెడ్డి, అశోక్కుమార్ మంచి మార్కులు సాధించిన స్టూడెంట్స్ను అభినందించారు.
అనంతరం వారు మాట్లాడుతూ.. ఫస్టియర్లో 490 పైగా, సెకండియర్లో 980 పైగా మార్కులు సాధించిన స్టూడెంట్స్ 50 మందికి పైగా ఉన్నారన్నారు. ఈ విద్యార్థులందరూ ఇంటర్ ఎంఈసీతో పాటు సీఏ కోర్సు చదువుతున్నారని తెలిపారు. మాస్టర్ మైండ్స్విద్యా సంస్థల అత్యున్నత బోధనా విధానం, క్రమశిక్షణే స్టూడెంట్స్విజయానికి కారణమని పేర్కొన్నారు.

