పంజాబ్‌ కెప్టెన్‌ గా మయాంక్‌ అగర్వాల్

పంజాబ్‌ కెప్టెన్‌ గా మయాంక్‌ అగర్వాల్

పంజాబ్ కింగ్స్ కొత్త కెప్టెన్ గా స్టార్ ప్లేయర్ మయాంక్ అగర్వాల్ ను నియమించినట్టు ప్రకటించింది ఆ జట్టు యాజమాన్యం. ఈ విషయాన్ని తమ సోషల్‌ మీడియా వేదికగా ప్రకటన చేసింది పంజాబ్‌ కింగ్స్‌. మయాంక్ నియామకంపై సంతోషం వ్యక్తం చేశారు పంజాబ్ కింగ్స్ చీఫ్ కోచ్ అనిల్ కుంబ్లే. ‘మయాంక్ 2018 నుంచి జట్టులో ఉన్నాడు. ఈసారి మా జట్టు అద్భుతమైన, అనుభవజ్ఞులైన ఆటగాళ్లతో పటిష్టంగా ఉంది. మయాంక్ రూపంలో మా జట్టుకు మంచి నాయకుడు దొరికాడు. అతడు ఉత్సాహవంతుడు. జట్టు కోసం బాగా కష్టపడతాడు. ఓ నాయకుడిగా కావాల్సిన అన్ని లక్షణాలు ఉన్నాయి. అతడితో కలిసి పని చేయడానికి ఆత్రుతగా ఎదురుచూస్తున్నా. మయాంక్ మా జట్టును విజయ తీరాల వైపు నడిపిస్తాడని ఆశిస్తున్నా’ అంటూ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు అనిల్ కుంబ్లే.

ఇవి కూడా చదవండి

బెంగాల్ స్థానిక ఎన్నికల్లో హింస..బంద్కు బీజేపీ పిలుపు

రష్యాతో ఫుట్బాల్ మ్యాచులను బహిష్కరించిన ఇంగ్లాండ్