
హైదరాబాద్, వెలుగు: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ నెల 8,9 తేదీల్లో టీజీఐసెట్ ఎగ్జామ్ నిర్వహించనున్నారు. 8న రెండు సెషన్లలో, 9న ఒక సెషన్లో పరీక్ష జరగనున్నది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకూ ఒక సెషన్, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ మరో సెషన్ లో పరీక్షలు నిర్వహించనున్నారు.
ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 71,757 మంది హాజరుకానున్నారు. వీరికోసం అధికారులు 96 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. హాల్ టికెట్లను https://icet.tgche.ac.in వెబ్ సైట్ లో పెట్టామని, అభ్యర్థులు డౌన్ లోడ్ చేసుకోవచ్చని అధికారులు సూచించారు.