మెదక్ టౌన్, వెలుగు: మెదక్ జిల్లాలో టెన్త్ లో 560కి పైగా మార్కులు వచ్చిన 70 మంది విద్యార్థులను కలెక్టర్ ప్రతిమాసింగ్అభినందిస్తూ వారిని రామోజీ ఫిలిం సిటీ సందర్శనకు మంగళవారం కలెక్టరేట్నుంచి బస్సుల్లో పంపించారు.
ప్రభుత్వ స్కూల్లో చదివే విద్యార్థులు మంచి మార్కులు సాధిస్తే విహారయాత్రకు పంపిస్తామని పరీక్షల సమయంలో మాట ఇచ్చారు. దీంతో మంచి మార్కులు సాధించిన 70 మంది విద్యార్థులను పంపించారు.
