V6 News

మంత్రి వివేక్ ను కలిసిన లైబ్రరీ చైర్పర్సన్ 

మంత్రి వివేక్ ను కలిసిన లైబ్రరీ చైర్పర్సన్ 

శివ్వంపేట, వెలుగు:  మెదక్  లైబ్రరీ చైర్​పర్సన్​ చిలుముల సుహాసిని రెడ్డి సోమవారం సెక్రటేరియట్​లో జిల్లా ఇన్​చార్జి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామిని కలిశారు.  నర్సాపూర్​ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసం ప్రత్యేక నిధులు ఇవ్వాలని, జిల్లాలో గ్రంథాలయాల అభివృద్ధికి అవసరమైన నిధులు కేటాయించాలని కోరారు. మంత్రి సానుకూలంగా స్పందించినట్టు ఆమె తెలిపారు. ఆమె వెంట కాంగ్రెస్​ మండల అధ్యక్షుడు  సుదర్శన్ గౌడ్  ఉన్నారు.