
కౌడిపల్లి, వెలుగు: కారు ఢీకొని జూనియర్ అసిస్టెంట్ మృతి చెందిన ఘటన మెదక్జిల్లా కౌడిపల్లి మండల కేంద్రం సమీపంలో జరిగింది. ఎస్సై రంజిత్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. కౌడిపల్లి మండలం తిమ్మాపూర్ కి చెందిన అబ్దుల్ నబీ (25) మెదక్ ఆర్డీవో కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్నాడు. గురువారం ఉదయం తన బైక్పై డ్యూటీకి వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొనడంతో అబ్దుల్ నబీ కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా, పెళ్లయిన ఆరు నెలలకే నబీ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.