రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షాలతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే వైద్యారోగ్య శాఖను అప్రమత్తం చేసిన ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.
హెల్త్డిపార్ట్మెంట్లో వర్షాలు తగ్గేవవరకు ఏ ఉద్యోగి కూడా సెలవు పెట్టడానికి వీల్లేదని తేల్చిచెప్పింది. వారి సెలవులు రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల వైద్యారోగ్య శాఖ అధికారులు పబ్లిక్ హెల్త్డైరెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
ఉద్యోగులంతా పబ్లిక్కి అందుబాటులో ఉండాలని సూచించారు. వైరల్ ఫీవర్స్ ప్రబలే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలన్నారు.