యాప్లో బండి బుక్ చేసుకుని స్నాచింగ్..మేడిపల్లిలో కేసును 20 గంటల్లో ఛేదించిన పోలీసులు

యాప్లో బండి బుక్ చేసుకుని స్నాచింగ్..మేడిపల్లిలో కేసును 20 గంటల్లో ఛేదించిన పోలీసులు
  •      ఆర్థిక ఇబ్బందులతో చోరీ 

మేడిపల్లి, వెలుగు: మహిళ మెడలో 3 తులాల బంగారు పుస్తెలతాడును లాక్కెళ్లిన ఇద్దరు చైన్ స్నాచర్లను మేడిపల్లి పోలీసులు కేవలం 20 గంటల్లోనే అరెస్ట్ చేశారు. సెప్టెంబర్ 2న రాత్రి 8.20 గంటలకు ఆర్టీసీ కాలనీ వద్ద చల్లా భారతి (38) నడుచుకుంటూ వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన స్నాచర్​ఆమె మెడలోని 3 తులాల బంగారు పుస్తెలతాడును లాక్కున్నాడు. కొంతదూరంలో బైక్​పై ఉన్న తన స్నేహితుడితో కలిసి చెంగిచెర్ల వైపు పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు స్పెషల్​టీమ్స్​ఏర్పాటు చేశారు. 

సీసీ కెమెరాల ఆధారంగా..

సీసీ కెమెరాల ఫుటేజీ, టెక్నికల్​ఎవిడెన్స్​ఆధారంగా నిందితులను రాజమండ్రికి చెందిన కంగాల వీవీఎస్పీ ప్రసాద్ (39), వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన అజ్మీర వెంకటేష్ (24)గా గుర్తించామని ఏసీపీ మోహన్​కుమార్​ తెలిపారు. ప్రసాద్ డ్రైవర్​కాగా, వెంకటేష్ ప్రైవేట్ ఎంప్లాయ్​గా పని చేస్తున్నాడన్నారు. ఆర్థిక ఇబ్బందుల వల్లే చైన్ స్నాచింగ్​చేసినట్టు విచారణలో వెల్లడైందని చెప్పారు. సొంత బండి అయితే దొరికిపోతామని ఓఎన్ఎన్ యాప్ ద్వారా టూ వీలర్​బుక్ చేసుకుని పోచారం, చెంగిచెర్ల తదితర ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించారన్నారు. చివరకు భారతిని టార్గెట్​చేసి స్నాచింగ్​చేసి పారిపోయారన్నారు