హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ జిల్లా పరిధిలోని రాజ్ భవన్ ప్రభుత్వ హైస్కూల్ లో ఇంగ్లిష్ చెప్పే స్కూల్ అసిస్టెంట్ పీవీ.సునీత బెస్ట్టీచర్అవార్డుకు ఎంపికైనట్లు డీఈవో తెలిపారు. సునీత ఐదేండ్లుగా రాజ్ భవన్ స్కూల్లో పని చేస్తున్నారు.
ఎస్సెస్సీ పరీక్షల్లో ఇంగ్లిష్ సబ్జెక్టులో వరుసగా 100 శాతం ఉత్తీర్ణత సాధించడంతోపాటు బస్తీ ప్రాంతాల్లో పేద విద్యార్థులు ఇంగ్లిష్భాషపై పట్టు సాధించేందుకు కృషి చేస్తున్నారు. ఆమెకు అవార్డు రావడంపై హెడ్మాస్టర్, టీచర్స్, స్టూడెంట్స్, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.
