యూనియన్ ​బ్యాంక్ ​ఆఫ్​ ఇండియా మెగా కస్టమర్ ఔట్ రీచ్

యూనియన్ ​బ్యాంక్ ​ఆఫ్​ ఇండియా మెగా కస్టమర్ ఔట్ రీచ్

హైదరాబాద్, వెలుగు:  సైఫాబాద్​లోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెగా కస్టమర్ ఔట్ రీచ్ ప్రోగ్రాం నిర్వహించింది. చీఫ్​ గెస్టుగా హాజరైన ఈడీ నిధు సక్సేనా  4 స్టాల్స్​ను ప్రారంభించినట్లు హైదరాబాద్ రీజినల్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ తెలిపారు. ఎస్​వోపీ, ఎంఎస్ఎంఈ రిటైల్, డిజిటల్ ఉత్పత్తులను స్టాల్స్​లో ప్రదర్శించామన్నారు. ఈ సందర్భంగా కస్టమర్లకు సూచన, మంజూరు పత్రాలను అందజేశారు.

కార్యక్రమంలో ఫీల్డ్ జనరల్ మేనేజర్ కారె భాస్కర్​ రావు, రీజినల్ హెడ్ శ్రీధర్​ బాబు, డిప్యూటీ రీజినల్ హెడ్  సీఎస్ రవి, రాజశేఖరం, ఎంఎల్​పీ హెడ్ కమలాకర్ పాల్గొన్నారు.