హైదరాబాద్, వెలుగు: సైఫాబాద్లోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెగా కస్టమర్ ఔట్ రీచ్ ప్రోగ్రాం నిర్వహించింది. చీఫ్ గెస్టుగా హాజరైన ఈడీ నిధు సక్సేనా 4 స్టాల్స్ను ప్రారంభించినట్లు హైదరాబాద్ రీజినల్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ తెలిపారు. ఎస్వోపీ, ఎంఎస్ఎంఈ రిటైల్, డిజిటల్ ఉత్పత్తులను స్టాల్స్లో ప్రదర్శించామన్నారు. ఈ సందర్భంగా కస్టమర్లకు సూచన, మంజూరు పత్రాలను అందజేశారు.
కార్యక్రమంలో ఫీల్డ్ జనరల్ మేనేజర్ కారె భాస్కర్ రావు, రీజినల్ హెడ్ శ్రీధర్ బాబు, డిప్యూటీ రీజినల్ హెడ్ సీఎస్ రవి, రాజశేఖరం, ఎంఎల్పీ హెడ్ కమలాకర్ పాల్గొన్నారు.