20వేల పోస్టులతో మెగా డీఎస్సీ వెయ్యాలి .. అభ్యర్థుల వినతి

20వేల పోస్టులతో మెగా డీఎస్సీ వెయ్యాలి ..   అభ్యర్థుల వినతి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో 20వేల పోస్టు లతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వేయాలని డీఈ డీ, బీఈడీ అభ్యర్థుల సంఘం ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరారు. గత ప్రభుత్వం ఇచ్చిన 5,089 పోస్టులకు మరో 15 వేల పోస్టులు కలపాలని విజ్ఞప్తి చేశారు. బుధవారం సచివాలయంలో మం త్రులు శ్రీధర్​బాబు, ఉత్తమ్​కుమార్ రెడ్డిని కలిసి వినతిపత్రాలు అందించారు. టీచర్ల బదిలీలు, ప్రమోషన్లతో డీఎస్సీకి ముడిపెట్టకుండా వెంట నే అనుబంధ నోటిఫికేషన్ జారీచేయాలన్నారు. పరీక్షా తేదీలను వెంటనే ప్రకటించాలని, ఆఫ్ లైన్ విధానంలోనే ఎగ్జామ్స్ కొనసాగించాలని కోరారు. దరఖాస్తుకు ఇంటర్, డిగ్రీల్లో అర్హత మార్కులను 40 శాతానికి తగ్గించి నోటిఫికేషన్ సవరించాలన్నారు. కాగా, కొంత టైం తీసుకొని మెగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీచేస్తామని మం త్రులు హామీ ఇచ్చినట్టు వారు చెప్పారు.