Sai Durga Tej: గాంజా ఇక లేనట్టే.. లైన్లోకి హనుమాన్ నిర్మాత

Sai Durga Tej: గాంజా ఇక లేనట్టే.. లైన్లోకి హనుమాన్ నిర్మాత

మెగా హీరో సాయి దుర్గతేజ్(Sai durgaTej) నెక్స్ట్ సినిమా ఎప్పుడంటూ ఆయన ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఆయన హీరోగా వచ్చిన గత చిత్ర విరూపాక్ష(Virupaksha) ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొత్త దర్శకుడు కార్తీక్ దండు(karthik Dandu) తెరకెక్కించిన ఈ సినిమా ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకుంది. గత సంవత్సరం ఏప్రిల్ లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.100 కొట్లకు పైగా వసూళ్లు రాబట్టి భారీ విజయాన్ని సాధించింది. ఇక అప్పటినుండి సాయి దుర్గతేజ్ నెక్స్ట్ సినిమా గురించి ఫ్యాన్స్ ఎదురుచూస్తూనే ఉన్నారు.

మధ్యలో మామ పవన్ కళ్యాణ్ తో కలిసి చేసిన బ్రో సినిమా ఎదో యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకుంది. దాదాపు సంవత్సర కాలంగా సోలో హీరోగా కొత్త సినిమాను అనౌన్స్ చేయలేదు ఈ హీరో. ఆమధ్య టాలెంటెడ్ డైరెక్టర్ సంపత్ నందితో గాంజా శంకర్ అనే మాస్ సినిమాను మొదలుపెట్టాడు సాయి తేజ్. అనౌన్స్మెంట్ వీడియోను కూడా విడుదల చేశారు. కానీ, కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా మొదలవకుండానే ఆగిపోయిందనే వార్తలు వైరల్ అవుతున్నాయి.

దీంతో.. ఆ సినిమాను పక్కన పెట్టేసి మరో కొత్త దర్శకుడికి అవకాశం ఇస్తున్నాడట ఈ మెగా హీరో. ఇటీవలే హనుమాన్ సినిమాతో నేషనల్ వైడ్ భారీ విజయాన్ని అందుకున్న నిర్మాత నిరంజన్ రెడ్డి ఈ సినిమాను నిర్మిచనున్నారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే దర్శకుడు ఎవరు అనే విషయంపై క్లారిటీ రాలేదు కానీ, త్వరలోనే ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని టాక్. మరి సంపత్ నందికి కాదని కొత్త దర్శకుకడికి అవకాశం ఇస్తున్నాడు అంటే.. కంటెంట్ బలంగా ఉండబోతుంది అని అర్థమౌతోంది. మరి ఈ సినిమాతో సాయి దుర్గతేజ్ ఎలాంటి విజయాన్ని సాధిస్తాడా చూడాలి.