జమాతే ఇస్లామీపై నిషేధం ఎత్తేయాలి : ముఫ్తీ ఆందోళన

జమాతే ఇస్లామీపై నిషేధం ఎత్తేయాలి : ముఫ్తీ ఆందోళన

జమాతే ఇస్లామి సంస్థను బ్యాన్ చేయడాన్ని పీడీపీ తప్పుబట్టింది. కేంద్ర సర్కార్ నిర్ణయానికి నిరసనగా శ్రీనగర్ లో పీడీపీ అధ్యక్షురాలు, జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ఆందోళనకు దిగారు. ఆందోళనలో పీడీపీ కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. జమాతే ఇస్లామీ సంస్థపై విధించిన నిషేధాన్ని వెంటనే ఎత్తివేయాలని ఆమె డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాలతో కశ్మీర్ లో కల్లోల పరిస్థితులు నెలకొంటున్నాయని ముఫ్తీ అన్నారు.