బీజేపీలోకి ‘మెట్రోమ్యాన్’ శ్రీధరన్!

బీజేపీలోకి ‘మెట్రోమ్యాన్’ శ్రీధరన్!

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ప్రతిష్టాత్మక మెట్రో రైల్ ప్రాజెక్టు చేపట్టి మెట్రోమ్యాన్‌‌గా పేరొందిన ఈ.శ్రీధరన్ బీజేపీలో చేరనున్నారని సమాచారం. ఈ విషయాన్ని కేరళ బీజేపీ విభాగం ప్రకటించింది. పార్టీ కోరితే తాను ఎన్నికల్లో పోటీ చేయడానికి రెడీనని పొలిటికల్ ఎంట్రీపై శ్రీధరన్ క్లారిటీ ఇచ్చారు. కేరళలో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో శ్రీధరన్ రాజకీయాల్లోకి ప్రవేశించడం, అందులోనూ బీజేపీలో చేరనుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. కేరళలో ఈ ఆదివారం బీజేపీ నిర్వహిస్తోన్న విజయ్‌ యాత్రలో భాగంగా శ్రీధరన్‌ పార్టీలో చేరునున్నట్లు సమాచారం. దేశంలో మెట్రో రైళ్లకు రూపకల్పన చేసిన క్రెడిట్ శ్రీధరన్‌‌కు దక్కుతుంది.