అమెరికాలో కరోనా వైరస్ ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. దీంతో బైడెన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైరస్ కట్టడికి దేశవ్యాప్తంగా లక్షల సంఖ్యలో మాస్కులను పంపిణీ చేయాలని నిర్ణయించింది. త్వరలోనే మాస్కుల పంపిణీకి చర్యలు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ కార్యక్రమానికి ఎంత ఖర్చు అవుతుంది… ఎలాంటి మాస్కులు అందిస్తారనే విషయంపై వైట్ హౌజ్ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.
మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హయాంలోనే మాస్కులు పంపిణీ చేయాలని భావించినప్పటికీ అది అమల్లోకి రాలేదు. జో బైడెన్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక మొదటి వంద రోజులు ప్రతి ఒక్కరు మాస్కులు తప్పనిసరిగా ధరించాలని ఆయన కోరారు. ప్రజా రవాణా, కార్యాలయాల్లోనూ మాస్కులు ధరించడాన్ని బైడెన్ తప్పనిసరి చేశారు.