కరెంట్ మోటార్లకు మీటర్లు పెట్టనివ్వం 

కరెంట్ మోటార్లకు మీటర్లు పెట్టనివ్వం 

సర్పంచ్ లు ఎవరూ అధైర్య పడొద్దని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు భరోసా ఇచ్చారు. త్వరలో అన్ని బిల్లులు మంజూరు చేస్తామన్నారు. సీసీ రోడ్ల బిల్లులు కూడా రిలీజ్ చేస్తామన్నారు. గ్రామపంచాయతీలకు నిధులు ఇవ్వడం లేదని బీజేపీ, కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చే నిధుల విషయంలో ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరోపించారు. కరెంట్ మోటార్లకు మీటర్లు పెడతామని అమిత్ షా చెబుతున్నారని.. ఎట్టి పరిస్థితుల్లోనూ మోటార్లు పెట్టనివ్వబోమన్నారు. కొత్త పెన్షన్లు త్వరలోనే ఇస్తామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో తాగు, సాగునీటికి ఢాకా లేదన్నారు. రాష్ట్రాభివృద్దికి టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. 

మరిన్ని వార్తల కోసం

ప్రియుడిని పెళ్లి చేసుకొనేందుకు బంగ్లాదేశ్ యువతి సాహసం

ప్రియాంక గాంధీకి కరోనా పాజిటివ్