ప్రియాంక గాంధీకి కరోనా పాజిటివ్ 

ప్రియాంక గాంధీకి కరోనా పాజిటివ్ 

మాయదారి మహమ్మారి కరోనా ఎవ్వరినీ వదిలిపెట్టడం లేదు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ దాని బారిన పడుతున్నారు. కాంగ్రెస్ అధ్యక్షరాలు సోనియా గాంధీకి కరోనా సోకిన మరుసటి రోజే ఆమె తనయ ప్రియాంక గాంధీకి కూడా కోవిడ్ సోకింది. స్వల్ప లక్షణాలతో బాధపడుతున్నట్టు ఆమె ట్వీట్ చేశారు. కోవిడ్ నిర్ధారణ పరీక్షల్లో పాజిటివ్ గా తేలిందన్నారు. కొవిడ్ మార్గదర్శకాల ప్రకారం తాను హోం క్వారంటైన్‌లో ఉన్నానని ప్రియాంక పేర్కొన్నారు. తనను కలిసిన వారు, పరిచయం ఉన్నవారు కూడా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె సూచించారు.

బుధవారం సాయంత్రం సోనియాగాంధీకి స్వల్ప జ్వరం వచ్చిందని, కొన్ని కొవిడ్‌ లక్షణాలు ఉండడంతో గురువారం ఉదయం ఆమెకు కరోనా పరీక్ష చేశారు. ఆ పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం సోనియా ఐసొలేషన్‌లో ఉన్నారు. ఆమెకు అవసరమైన వైద్య సహాయం అందుతోంది. గత వారం రోజులుగా సోనియా పార్టీ నాయకులు, కార్యకర్తలను కలుసుకున్నారని, వారిలో కూడా కొందరికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్టు గుర్తించామని సుర్జేవాలా ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం సోనియా బాగానే ఉన్నారని, త్వరగా కోలుకుంటున్నారని చెప్పారు. 

మరిన్ని వార్తల కోసం

ఉప్పల్ లో బలవంతపు పెళ్లి..వీడియో వైరల్

జీవనశైలిలో గాంధీ కన్నా స్ఫూర్తి ఇంకెవరు ?