ఎవరికి ఓటువేస్తే మంత్రి వద్దకు వెళ్లగలరో ప్రజలే తెలుసుకోవాలి

ఎవరికి ఓటువేస్తే మంత్రి వద్దకు వెళ్లగలరో ప్రజలే తెలుసుకోవాలి

టీఆర్​ఎస్​ పథకాలే అభ్యర్థులకు శ్రీరామ రక్ష అని అన్నారు మంత్రి ఈటల రాజేందర్. హుజూరాబాద్‌లో మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో మంత్రి మాట్లాడుతూ.. గెలిచే పార్టీ టీఆర్​ఎస్సేనని, కాంగ్రెస్​, బీజేపీలు గెలవడం కష్టమేనన్నారు. కాబట్టి ఎవరికి ఓటు వేస్తే మంత్రి వద్దకు వెళ్తారో ప్రజలు గమనించి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఓడిపోయే పార్టీలకు ఓటేస్తే ప్రయోజనం ఉండదన్నారు.

టీఆర్​ఎస్​ పథకాలు ప్రతి ఇంటికి చేరాయని, హుజురాబాద్‌, జమ్మికుంటను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే అభివృద్ధి చేసిందన్నారు. హుజూరాబాద్​లో రూ. 50 కోట్లు, జమ్మికుంటలో రూ. 40 కోట్ల నిధులతో తాగునీటి సమస్యకు పరిష్కారం చూపిన ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమని, ప్రభుత్వ వైద్యాన్ని ప్రజలకు అందుబాటులో తెచ్చింది కూడా ఇదే ప్రభుత్వమన్నారు. కారు గుర్తుకు ఓటేసి ప్రభుత్వానికి అండగా నిలవాలని ఓటర్లకు పిలుపునిచ్చారు మంత్రి ఈటల.