తెలంగాణ పచ్చపడుతుంటే కేంద్రం ఓర్వలేక పోతుందన్నారు మంత్రి గంగుల కమలాకర్.. కరీంనగర్ కలెక్టరేట్ ముందు ఆందోళనలో మంత్రి పాల్గొన్నారు...ధాన్యం కాంటా పెట్టి... తూకం వేస్తూ నిరసన తెలియజేశారు. తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపిస్తుందని ఆరోపించారు. మద్ధతు ధర నిర్ణయించడంతో పాటు, పంటను కొనే అధికారం, బాధ్యత కేంద్రానిదేనన్నారు గంగుల కమలాకర్.. కొనుగోలు చేసిన పంటను.. గోదాముల్లో దాచుకునే అధికారం కూడా రాష్ట్రాలకు లేదని తెలిపారు. ఎంత పంట పండినా కొనాల్సిన బాధ్యత కేంద్రానిదే అన్నారు మంత్రి గంగుల.