మంత్రి గంగుల నుంచి ప్రాణ హాని

మంత్రి గంగుల నుంచి ప్రాణ హాని

బషీర్ బాగ్, వెలుగు: మంత్రి గంగుల కమలాకర్ నుంచి తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలంటూ ఓ అంధుడు సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను వేడుకున్నారు. మంత్రి ప్రోద్భలంతో అతని అనుచరులు మహిపాల్, కర్ర రవీందర్ రెడ్డి తన భూమిని కబ్జా చేశారని ఆరోపించారు. తనకు న్యాయం చేయాలని మంత్రి దగ్గరికి వెళ్తే చంపేస్తామని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

వారికి భయపడి హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో తలదాచుకున్నానని బాధిత అంధుడు చెట్టి వెంకట్ రమణ తెలిపారు. మంగళవారం హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌‌‌‌‌‌‌‌లో బాధితుడు మీడియాతో మాట్లాడారు. 2007లో కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం మల్కాపూర్ గ్రామ పంచాయతీలోని లక్ష్మీపూర్ గ్రామంలో తాను ఎకరం భూమిని కొన్నానని, కుటుంబ అవసరాల కోసం ఇటీవల 10 గుంటలను విక్రయించానని చెప్పారు. మిగిలిన 30 గుంటల భూమిని మంత్రి అనుచరులు కబ్జా చేశారని తెలిపారు. భూమిని వదులుకుంటే రూ.30 లక్షలు ఇస్తామని మంత్రి చెప్పారన్నారు. 

చెప్పినట్లు వినకపోతే తనతో పాటు కుటుంబ సభ్యులను చంపుతామని బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు. తన ముగ్గురు కూతుళ్ల పెళ్లి కోసం కొన్న భూమిని తనకు ఇప్పించి, కుటుంబానికి రక్షణ కల్పించాలని సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కోరారు.