శిఖండి రాజకీయాలు చెల్లవు

శిఖండి రాజకీయాలు చెల్లవు

కేసీఆర్ తమకు దేవుడి లాంటి వాడని, తమది టీఆర్ఎస్ సూసైడ్ దళమని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా కరీంనగర్ లో కొందరు శిఖండి రాజకీయాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కానీ తమకు కేసీఆర్ అండగా ఉన్నారని, ఇలాంటి పాలిటిక్స్ చెల్లవని హెచ్చరించారు. 

‘పురాణాల్లో దేవతల యజ్ఞాలను రాక్షసులు భగ్నం చేయాలని చూస్తారు. అయినా దేవీదేవతలదే విజయం. ఇక్కడ కూడా కొందరు కలియుగ రాక్షసులు కేసీఆర్ యజ్ఞాన్ని పాడు చేయాలని ప్రయత్నిస్తున్నారు. కానీ అంతిమంగా గెలుపు మా దేవుడు కేసీఆర్ దే’ అని గంగుల అన్నారు. తామంతా టీఆర్ఎస్ సూసైడ్ స్క్వాడ్ లాంటి వాళ్లమని, తలతెగినా గులాబీ జెండా వదిలేదే లేదని స్పష్టం చేశారు.