క‌రోనా రోగిప‌ట్ల వివ‌క్ష చూపితే క‌ఠిన చ‌ర్య‌లు

క‌రోనా రోగిప‌ట్ల వివ‌క్ష చూపితే క‌ఠిన చ‌ర్య‌లు

సంగారెడ్డి జిల్లా : వైకుంఠ ధామం, డంప్ యార్డ్ ల నిర్మాణంలో సంగారెడ్డి జిల్లా మొదటి స్థానంలో ఉందన్నారు ఆర్థిక‌శాఖ మంత్రి హ‌రీష్ రావు. శుక్ర‌వారం పఠాన్ చెరు నియోజక వర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు హరీష్ రావు. ఈ సంద‌ర్భంగా మాట్లాడిన ఆయ‌న‌.. కరోనా వ్యాధితో ప్రజలు భయపడాల్సిన అవసరం లేదన్నారు. సంగారెడ్డిలో 100 పడకల ఐసోలేషన్ సెంటర్ ను ప్రారంభిస్తామ‌ని, కరోనా వ్యాధి రాకుండా సామాజిక దూరం పాటించాలన్నారు.

కరోనా వ్యాధి సోకిన వ్యక్తి పట్ల వివక్షత చూపవద్దని.. వ్యాధి సోకిన వ్యక్తిని ఇంటి యజమానులు ఇల్లు ఖాళీ చేయాలని ఇబ్బంది పెడితే చట్టరీత్య నేరమ‌న్నారు. వివక్ష చూపిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చ‌రించారు. కరోనా కష్టకాలంలో ప్రజా ప్రతినిధులు , నాయకులు ప్రజలకు అండగా నిలిచి ధైర్యం ఇవ్వాలన్నారు మంత్రి హ‌రీష్.

మ‌రిన్ని వార్తల కోసం..