బీజేపీకి ఇవే చివరి ఎన్నికలు

బీజేపీకి ఇవే చివరి ఎన్నికలు

ప్రధాని మోడీ ఇచ్చిన అక్రమ సొమ్ముతో మునుగోడులో రాజ్ గోపాల్ రెడ్డి గెలవాలని చూస్తున్నారని మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. మునుగోడులో టీఆర్ఎస్ గెలుపు తథ్యమని చెప్పారు. ఈ ఎన్నికల్లో బీజేపీ మూడో స్థానానికే పరిమితం అవుతుందని ఆయన జోస్యం చెప్పారు. బీజేపీకి ఇవే చివరి ఎన్నికలని..ప్రజలు బీజేపీని తిరస్కరిస్తారన్నారు. ఈడీ, బోడీలకు భయపడే ప్రసక్తే లేదని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ఈడీని బీజేపీ తమ జేబు సంస్థగా భావిస్తున్నాయని మండిపడ్డారు.  బండి సంజయ్ గల్లీ లీడర్ అని జగదీష్ రెడ్డి ఎద్దేవా చేశారు. 

నల్లగొండ  క్లాక్ టవర్ సెంటర్లో 100 ఫీట్ల ఎత్తులో.. జాతీయ జెండాని మంత్రి జగదీష్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా  దేశంలో బీజేపీ దుర్మార్గాలను బయటపెట్టే సత్తా ఉన్న ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్ అని చెప్పారు.  బిజెపి పాలనలో.. దేశం మధ్యయుగ కాలం నాటికి వెళ్ళిందని విమర్శించారు. బిజెపిని వ్యతిరేకించే వామపక్షాలు.. టీఆర్ఎస్తో రావాలని కోరారు. వాపపక్షాలు కలిసి వస్తానంటే చర్చలకు ఆహ్వానిస్తామని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు.