పేదల సంక్షేమం సుపరిపాలనే లక్ష్యం : మంత్రి జూపల్లి కృష్ణారావు 

పేదల సంక్షేమం సుపరిపాలనే లక్ష్యం : మంత్రి జూపల్లి కృష్ణారావు 

మహబూబ్ నగర్ కలెక్టరేట్: పేదల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం  కొత్త పాలసీలను రూపకల్పన చేసి పారదర్శకమైన పాలన అందిస్తుందని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. మహబూబ్ నగర్ లో జరిగిన వేడుకల్లో పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రాన్ని దేశంలో, ప్రపంచంలో అగ్రగామిగా నిలిపేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పారు. రాష్ట్రాభివృద్ధికి ఆర్థిక, సామాజిక, పరిపాలనరంగాల్లో ఆదర్శవంతమైన లక్ష్యాలతో రూపొందించిన తెలంగాణ రైజింగ్  2047 విజన్  డాక్యుమెంట్  తెలంగాణ రూపురేఖలను మార్చుతుందన్నారు. 

గిరిజన ప్రాంతాల్లోని చెంచులకు 10 వేల ఇందిరమ్మ ఇండ్లు కేటాయించామని తెలిపారు. గిరిజనుల భూములకు సాగునీరు, విద్యుత్  సదుపాయానికి ఇందిర సౌర గిరి జల వికాసం కార్యక్రమం ప్రారంభమైందన్నారు. పాలమూరు జిల్లాలో 10,693 ఇండ్లు మంజూరు చేయగా, 670 ఇండ్ల  పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. బాలానగర్ మండలం పెద్దాయి పల్లి, చిన్నచింతకుంట మండలం దమగ్నపూర్ యంగ్  ఇండియా ఇంటిగ్రేటెడ్  రెసిడెన్షియల్  స్కూల్స్ కు శంకుస్థాపన చేశామని గుర్తు చేశారు .ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాసరెడ్డి, జి.మధు సూధన్ రెడ్డి, జనంపల్లి అనిరుధ్​రెడ్డి, కలెక్టర్ విజయేందిర బోయి, ఎస్పీ డి జానకి పాల్గొన్నారు.