కేసీఆర్, హరీశ్‌‌‌‌కు కాంగ్రెస్‌‌‌‌ సత్తా చూపుతాం : కొండా సురేఖ

కేసీఆర్, హరీశ్‌‌‌‌కు కాంగ్రెస్‌‌‌‌ సత్తా చూపుతాం : కొండా సురేఖ
  •     మెదక్‌‌‌‌లో కాంగ్రెస్‌‌‌‌ విజయం ఖాయం
  •     మంత్రి కొండా సురేఖ

సంగారెడ్డి, వెలుగు : మెదక్‌‌‌‌ గడ్డపై తిరిగి కాంగ్రెస్‌‌‌‌ జెండా ఎగరేయబోతున్నామని మంత్రి కొండా సురేఖ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌‌‌‌ సత్తా ఏమిటో కేసీఆర్‌‌‌‌, హరీశ్‌‌‌‌కు చూపుతామన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌‌‌‌చెరు మండలం రుద్రారంలో శుక్రవారం  మీడియాతో మాట్లాడారు. మెదక్‌‌‌‌ పార్లమెంట్‌‌‌‌ సెగ్మెంట్‌‌‌‌ను కాంగ్రెస్‌‌‌‌ ఛాలెంజ్‌‌‌‌గా తీసుకుందన్నారు. కాంగ్రెస్‌‌‌‌ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారంటీలను ప్రతి గడపకు తీసుకెళ్లేందుకు కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రతిఒక్కరూ కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్‌‌‌‌ పటిష్టంగా ఉందన్న విషయాన్ని నిరూపించాలని సూచించారు.

కాంగ్రెస్‌‌‌‌ క్యాండిడేట్‌‌‌‌ నీలం మధును భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పారు. రేపటి నుంచి ప్రచారం ముమ్మరంగా చేయాలని సూచించారు. అంతకుముందు రుద్రాంలోని గణేశ్‌‌‌‌ దేవస్థానం వద్ద ప్రచార రథాలను ప్రారంభించారు. కార్యక్రమంలో టీపీసీసీ వర్కింగ్‌‌‌‌ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, టీజీఐఐసీ చైర్‌‌‌‌పర్సన్‌‌‌‌ నిర్మలారెడ్డి, పటాన్‌‌‌‌చెరు అసెంబ్లీ ఇన్‌‌‌‌చార్జి శ్యాంగౌడ్ పాల్గొన్నారు.

కార్యకర్తలకు అండగా ఉంటాం

గజ్వేల్, వెలుగు : గజ్వేల్, సిద్దిపేటలో కార్యకర్తలకు అండగా ఉంటామని మంత్రి కొండా సురేఖ హామీ ఇచ్చారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌‌‌‌లో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. వెనుకబడిన వర్గాల నుంచి వచ్చిన నీలం మధును భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మైనంపల్లి హన్మంతరావు, నిర్మలా జగ్గారెడ్డి, చెరుకు శ్రీనివాస్‌‌‌‌రెడ్డి పాల్గొన్నారు.