మైనర్లైనా సరే పెద్ద శిక్షే వేయాలి

మైనర్లైనా సరే పెద్ద శిక్షే వేయాలి

హైదరాబాద్: మహిళలపై అఘాయిత్యం లాంటి పెద్ద నేరాలు చేస్తే మైనర్లకైనా సరే  మేజర్లకు వేసే శిక్షే వేయాలని మంత్రి కేటీఆర్ అన్నారు. జూబ్లీ హిల్స్ బాలిక కేసులో విచారణ చేసేందుకు నిందితులను మేజర్లుగా పరిగణించాలని హైదరాబాద్ పోలీసులు జువైనల్ జస్టిస్  బోర్డును కోరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసుల నిర్ణయం పట్ల మంత్రి కేటీఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు.  పోలీసుల నిర్ణయాన్ని సమర్థిస్తూ ట్వీట్ చేశారు. ‘ ఓ మైనర్ పెద్దోళ్లలా మహిళలపై అఘాయిత్యం లాంటి నేరం చేస్తే... పెద్ద శిక్షే వేయాలి. అంతే తప్ప అతణ్ని మైనర్ లా చూడొద్దు. ఈ విషయంలో పోలీసులు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా’ అంటూ ట్వీట్ చేశారు.