నరేంద్ర మోడీకి నోబెల్ బహుమతి ఇవ్వాలి : కేటీఆర్

నరేంద్ర మోడీకి నోబెల్ బహుమతి ఇవ్వాలి : కేటీఆర్

నరేంద్ర మోడీపై మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. కరోనా వ్యాక్సిన్ కనిపెట్టినందుకు మోడీకి నోబెల్ బహుమతికి అర్హులంటూ ఎద్దేవా చేశారు. వ్యాక్సిన్ ఒక్కటే కాదు డీమోనిటైజేషన్, స్విస్ బ్లాక్ మనీ రిటర్న్స్ చేసినందుకు ఆర్థికశాస్త్రంలో నోబెల్ ఇవ్వాలంటూ ట్వీట్ చేశారు.

‘‘ప్రధాని మోడీ నోబెల్ బహుమతికి అర్హులు..కానీ ఏ కేటగిరీలో ఉన్నారు?.  కోవిడ్ వ్యాక్సిన్‌ను కనిపెట్టినందుకు వైద్యంలో నోబెల్ ఇవ్వాలి. డీమోనిటైజేషన్, స్విస్ బ్లాక్ మనీ రిటర్న్స్ చేసినందుకు ఆర్థిక శాస్త్రాంలో నోబెల్ ఇవ్వాలి. రష్యా- ఉక్రెయిన్ యుద్ధాన్ని 6 గంటల పాటు ఆపినందుకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలి. రాడార్ సిద్ధాంతానికి భౌతిక శాస్త్రాంలో నోబెల్ ఇవ్వాలి’’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.