రాష్ట్రమంత్రి మల్లారెడ్డి ఔదార్యం చాటుకున్నారు. మేడ్చల్ మండలం గుండ్లపోచంపల్లి లోని గౌరీ ఆశ్రమంలో ఒక అనాధ యువతికి పెళ్లి జరిపించారు. స్వయంగా మల్లారెడ్డి దంపతులు కన్యాదానం చేశారు. అంతే కాదు యువతి పేరుతో 2 లక్షల 35 వేలు ఫిక్స్ డ్ డిపాజిట్ చేయించారు. ఇక పెళ్లి ఖర్చుల కోసం 25 వేల రూపాయలు ఇచ్చారు.
గుండ్లపోచంపల్లి లోని గౌరీ ఆశ్రమంలో ఉంటున్న పుష్ప అనే యువతికి ఏపీ విజయవాడకు చెందిన కిషోర్ కు ఇచ్చి పెళ్లి చేయించారు మంత్రి మల్లారెడ్డి. అమ్మాయి తరపున మల్లారెడ్డి, ఆయన భార్య కల్పన అన్నీ తామై వ్యవహరించారు. గౌరీ ఆశ్రమ నిర్వాహకులు, వివాహానికి వచ్చిన పెద్దలు, స్థానికులు మల్లారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.