మంత్రి మల్లారెడ్డి మానవత్వం చాటుకున్నారు. కరెంట్ స్తంభంలో తల ఇరుక్కొని ఇబ్బంది పడుతున్న ఓ ఆవును కాపాడారు. జవహర్నగర్ లో ఓ కార్యక్రమనికి హాజరై వెళ్తున్న మంత్రికి మార్గమధ్యలో కరెంట్ స్తంభంలో తల ఇరుక్కుని ఇబ్బంది పడుతున్న ఓ ఆవు కనిపించింది. దీనిని చూసిన మల్లారెడ్డి తన కాన్వాయ్ను ఆపి తన సిబ్బందితో కలిసి ఆవును బయటకు తీశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.