లాండ్రీ, ధోబీఘాట్లకి విద్యుత్ అధికారులు కనెక్షన్ కట్ చేయరని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రజక, నాయి బ్రాహ్మణల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. ఎవరు అధైర్యపడవద్దని ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను క్రమానుగతంగా తప్పకుండా అమలు చేస్తుందని చెప్పారు. డిస్కంలకు ఉన్న బకాయిలు విడుదల చేయాలని ఆర్థక శాఖను బీసీ మంత్రిత్వ శాఖ అభ్యర్థించబడిందని తెలిపారు.
2020 సంవత్సరం నుంచి లాండ్రీలు, ధోబీ ఘాట్, హెయిర్ కటింగ్ సెలూన్లకు ప్రభుత్వం 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తుందని మంత్రి తెలిపారు. ఆరు గ్యారంటీల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొన్నం తెలిపారు.