అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్రూం ఇళ్లు కేటాయిస్తామన్నారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లోని.. లెనిన్ నగర్ లో 80 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఆమె ప్రారంభించారు. 3 ఎకరాల స్థలంలో 200 మంది లబ్దిదారులకు.. 10 బ్లాక్ లు నిర్మాణం చేపట్టారు. ఇందులో 5 బ్లాక్ లు పూర్తి కావడంతో లాటరీ పద్దతిలో డ్రా తీశారు. మొదటి విడతలో ఎంపికైన 80 మంది లబ్దిదారులకు పట్టాలు అందజేశారు మంత్రి. మిగితా లబ్దిదారులకు నిబంధనల ప్రకారం ఇళ్లను కేటాయిస్తామన్నారు.
మరిన్ని వార్తల కోసం...