కాంగ్రెస్ ఇచ్చే హామీలకు వ్యారంటీ లేదన్న వాళ్లు అడ్రస్ లేకుండాపోయారని విమర్శించారు మంత్రి సీతక్క. అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే రెండు గ్యారంటీలను అమలు చేశాం..ఇవాళ మరో రెండు గ్యారంటీలకు శ్రీకారం చుట్టామని చెప్పారు. చేవెళ్ల జనజాతర సభలో మాట్లాడిన ఆమె.. తప్పుడు కూతలు కూసినవాళ్లు అడ్రస్ లేకుండా పోయారని మండిపడ్డారు. కాంగ్రెస్ పై అపనమ్మకాలు సృష్టించే కుట్ర జరుగుతోందన్నారు. గాంధీ కన్న కలలు నిజం చేస్తున్న పార్టీ కాంగ్రెస్ అని చెప్పారు.
ALSO READ :- ప్రజాహిత యాత్రపై దాడికి కాంగ్రెస్ యత్నం
హామీలు అమలు చేస్తుంటే బీఆర్ఎస్ ఓర్వలేకపోతుందన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కాకుంటే బాగుంటుందని బీఆర్ఎస్ నేతలు కోరుకుంటున్నారని చెప్పారు. రూ.400ల సిలిండర్ ను బీజేపీ రూ.1200లకు పెంచిందన్నారు. పేదలు కరెంట్ వాడలేని పరిస్థితి వచ్చిందన్నారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇచ్చి పేదలను ఆదుకుంటున్నామని చెప్పారు సీతక్క. ఆడవాళ్లు ఆర్థికంగా,సామాజికంగా,రాజకీయంగా బలంగా ఉన్నప్పుడే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పారు.