మధిర, వెలుగు: ఎన్నికల ప్రక్రియలో బీఎల్ఏల పాత్ర అత్యంత కీలకమని, ఓటరు జాబితాల పరిశీలన, సవరణలు, అభ్యంతరాల నమోదు, అర్హులైన ప్రతి ఓటరిని జాబితాలో చేర్చే విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు సూచించారు.
బుధవారం మధిర మండలంలోని దెందుకూరులో శ్రీనుబాబు ఆధ్వర్యంలోఎస్ఐఆర్పై కాంగ్రెస్ పార్టీ బీఎల్ఏలకు శిక్షణ నిర్వహించారు.
