కేసీఆర్ని పరామర్శించిన మంత్రి తుమ్మల

కేసీఆర్ని పరామర్శించిన మంత్రి తుమ్మల

హైదరాబాద్ సోమాజీగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ సీఎం కేసీఆర్‌‌ను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం(డిసెంబర్ 13) పరామర్శించారు. ఆయనతో కొద్దిసేపు మాట్లాడారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.

6 వారాల్లో కోలుకోవచ్చని డాక్టర్లు చెప్తున్నారని చెప్పారు. ఆయన త్వరగా కోలుకోని సాధారణ జీవితం ప్రారంభించాలని కోరుకుంటున్నానని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.